Sunday, April 28, 2024

ఎపిలో కొత్తగా 3,797 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 3797 new Covid-19 cases

అమరావతి: ఎపిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,797 మందికి కరోనా సోకింది. తాజాగా మరో 35 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,498 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 18,89,513కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18,38,469 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకోగా, 12,706 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రలో 38,338 క్రియాశీల కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నేటి వరకు రాష్ట్రంలో 2,19,93,618 మందికి సాంపిల్స్ ని పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News