Monday, April 29, 2024

విజయదశమి కానుకగా…

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది. అయితే షూట్ చేయబడిన 17 నిమిషాలు గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా ఈనెల 24న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. తాజాగా ‘నర్తనశాల’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా అర్జునుడిగా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ పౌరాణిక చిత్రాన్ని ఎన్‌బికె థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈనెల 24న విడుదల చేయనున్నారు.

 

Balakrishna look released from Narthanasala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News