Monday, April 29, 2024

మంత్రి జైశంకర్‌కు జడ్ క్యాటగిరీ భద్రత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు జడ్ క్యాటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. జడ్ క్యాటగిరీ భద్రతలో భాగంగా మంత్రి రక్షణ కోసం ఏకంగా 33 మంది సిఆర్‌పిఎఫ్ కమెండోలను నియమించింది. అంతకు ముందు జైశంకర్‌కు కేంద్రం వై క్యాటగిరీ భద్రత కల్పించింది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News