చెన్నై: కరోనా సోకిన గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. నిండు గర్భవతికి కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. 2.8 కిలోల పాపను సదరు మహిళ ప్రసవించింది. ప్రస్తుతం పసికందుకు కూడా కరోనా టెస్టు చేశామని, 24 గంటల తరువాత కరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయం చెబుతామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంది. తాజాగా తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో 20 రోజుల పసికందు కరోనా వైరస్ నుంచి కోలుకుంది. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 33,184 మందికి సోకగా 1081 మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా పాజిటీవ్ల సంఖ్య 1016 చేరుకోగా 25 మంది చనిపోయారు. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 2162కు చేరుకోగా 27 మంది మరణించారు.
రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
|
బాధితులు | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
మహారాష్ట్ర
|
9,915 | 7,890 | 1,593 | 432 |
గుజరాత్
|
4,082 | 3,358 | 527 | 197 |
ఢిల్లీ | 3,439 | 2,291 | 1,092 | 56 |
మధ్య ప్రదేశ్ | 2,560 | 1,969 | 461 | 130 |
రాజస్థాన్ | 2,524 | 1,640 | 827 | 57 |
తమిళనాడు | 2,162 | 925 | 1,210 | 27 |
ఉత్తర ప్రదేశ్
|
2,134 | 1,585 | 510 | 39 |
ఆంధ్రప్రదేశ్
|
1,332 | 1,014 | 287 | 31 |
తెలంగాణ | 1,016 | 582 | 409 | 25 |
పశ్చిమ బెంగాల్ | 758 | 612 | 124 | 22 |
జమ్ము కశ్మీర్ | 581 | 381 | 192 | 8 |
కర్నాటక
|
534 | 297 | 216 | 21 |
కేరళ | 496 | 123 | 369 | 4 |
బిహార్
|
403 | 337 | 64 | 2 |
పంజాబ్ | 375 | 255 | 101 | 19 |
హర్యానా | 311 | 83 | 225 | 3 |
ఒడిశా
|
128 | 88 | 39 | 1 |
ఝార్ఖండ్
|
107 | 85 | 19 | 3 |
ఛండీగఢ్
|
68 | 51 | 17 | – |
ఉత్తరాఖండ్ | 55 | 19 | 36 | – |
హిమాచల్ ప్రదేశ్
|
40 | 13 | 25 | 2 |
అస్సాం | 38 | 8 | 29 | 1 |
ఛత్తీస్ గఢ్ | 38 | 4 | 34 | – |
అండమాన్ నికోబార్ దీవులు
|
33 | 18 | 15 | – |
లడఖ్
|
22 | 5 | 17 | – |
మేఘాలయ | 12 | 11 | – | 1 |
పుదుచ్చేరీ
|
8 | 3 | 5 | – |
గోవా | 7 | – | 7 | – |
మణిపూర్ | 2 | – | 2 | – |
త్రిపుర
|
2 | – | 2 | – |
అరుణాచల్ ప్రదేశ్
|
1 | – | 1 | – |
మిజోరం | 1 | 1 | – | – |
మొత్తం | 33,184 | 23,648 | 8,455 | 1,081 |