Sunday, April 28, 2024

గర్భవతికి కరోనా…. పండంటి బిడ్డ జననం…

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కరోనా సోకిన గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. నిండు గర్భవతికి కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. 2.8 కిలోల పాపను సదరు మహిళ ప్రసవించింది. ప్రస్తుతం పసికందుకు కూడా కరోనా టెస్టు చేశామని, 24 గంటల తరువాత కరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయం చెబుతామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంది. తాజాగా తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో 20 రోజుల పసికందు కరోనా వైరస్ నుంచి కోలుకుంది. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 33,184 మందికి సోకగా 1081 మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా పాజిటీవ్‌ల సంఖ్య 1016 చేరుకోగా 25 మంది చనిపోయారు. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 2162కు చేరుకోగా 27 మంది మరణించారు.

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
 బాధితులు చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
9,915 7,890 1,593 432
గుజరాత్
4,082 3,358 527 197
ఢిల్లీ 3,439 2,291 1,092 56
మధ్య ప్రదేశ్ 2,560 1,969 461 130
రాజస్థాన్ 2,524 1,640 827 57
తమిళనాడు 2,162 925 1,210 27
ఉత్తర ప్రదేశ్
2,134 1,585 510 39
ఆంధ్రప్రదేశ్
1,332 1,014 287 31
తెలంగాణ 1,016 582 409 25
పశ్చిమ బెంగాల్ 758 612 124 22
జమ్ము కశ్మీర్ 581 381 192 8
కర్నాటక
534 297 216 21
కేరళ 496 123 369 4
బిహార్
403 337 64 2
పంజాబ్ 375 255 101 19
హర్యానా 311 83 225 3
ఒడిశా
128 88 39 1
ఝార్ఖండ్
107 85 19 3
ఛండీగఢ్
68 51 17
ఉత్తరాఖండ్ 55 19 36
హిమాచల్ ప్రదేశ్
40 13 25 2
అస్సాం 38 8 29 1
ఛత్తీస్ గఢ్ 38 4 34
అండమాన్ నికోబార్ దీవులు
33 18 15
లడఖ్
22 5 17
మేఘాలయ 12 11 1
పుదుచ్చేరీ
8 3 5
గోవా 7 7
మణిపూర్ 2 2
త్రిపుర
2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం 1 1
మొత్తం 33,184 23,648 8,455 1,081

 

Corona patient give birth baby in tamilnadu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News