Friday, May 17, 2024

శ్రీశైలం రెడ్డి అన్నదాన సత్రంలో దంపతుల ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని శ్రీశైలంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీశైలంలోని నీలం సంజీవరెడ్డి అన్నదాన సత్రంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కర్నూల్: జిల్లాలోని శ్రీశైలంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీశైలంలోని నీలం సంజీవరెడ్డి అన్నదాన సత్రంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని గమనించిన అన్నదాన సత్రం సిబ్బంది వారిని వెంటనే సున్నిపెంట ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గుంటూరు జిల్లాలోని మాచర్ల ప్రాంతానికి చెందిన నాగలక్ష్మీ(32), వెంకట కాళేశ్వరరావు(35)లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Couple suicide at reddy annadana satram in Srisailam 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News