Monday, April 29, 2024

ప్రేమపెళ్లి చేసుకున్న జంట మెడలో టైర్లు వేసి….

- Advertisement -
- Advertisement -

Couple thrashed forced to dance with tyres

భోపాల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట సొంతూరుకు వచ్చినప్పుడు… గ్రామ పెద్దలు ప్రేమజంట మెడలో టైర్లు వేసి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం ధార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుండి గ్రామంలో ఓ యువకుడు(23), యువతి(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో పలుమార్లు యువతి కుటుంబ సభ్యులు యువకుడిని బెదిరించాడు. సెప్టెంబర్ మొదటి వారంలో ఇంటి నుంచి ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పది రోజుల తరువాత యువకుడు యువతితో కలిసి తన ఇంటికి వచ్చాడు. పెద్దమనుషులు వారిని రచ్చబండ వద్దకు పిలిపించి వారిపై దాడి చేశారు. ప్రేమ జంట మెడల్లో టైర్లు వేసి కర్రలతో చితకబాదారు. స్థానికంగా ఉండే యువత ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రేమ జంటకు సాయం చేసిన 13 ఏళ్ల బాలికపై కూడా గ్రామ పెద్దలు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News