Sunday, April 28, 2024

కరోనాతో క్రికెటర్ తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టడంలేదు. కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.  తన తల్లి కరోనాతో చనిపోయిందని టీమిండియా మహిళ క్రికెటర్ పూనియా తెలిపారు. తన జీవిత కాలంలో ఇవాళ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ఇన్‌స్టాగ్రామ్‌లో పునియా పోస్టు చేసింది. మనకు ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిందన్నారు. తాను తీసుకునే ప్రతి వ్యూహం వెనుక తన తల్లి ఉంటుందని, ఇవాళ భౌతికంగా తనని విడిచిపెట్టిపోవడంతో నమ్మబుద్ధి కావడంలేదన్నారు. తన తల్లితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు కరోనా కాటుకు బలయ్యారు. కృష్ణమూర్తి తల్లి, సోదరిని కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. గతంలో టీమిండియా మాజీ క్రికెటర్లు పియుష్ చావ్లా, ఆర్పి సింగ్ కూడా కరోనాతో చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News