- Advertisement -
ఛాతి నొప్పితో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్కు అస్వస్థత
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో రాత్రి 8.45 గంటలకు కార్డియో థొరాసిక్ వార్డులో చేర్చారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఆయన ఉన్నారు. ఈ వారం మొదట్లో ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -