న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడమే మేలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోతే భారత జట్టుకే సిగ్గే చేటని ఘాటు విమర్శలు చేశాడు. వన్డేలు, టి20 ఫార్మాట్లో రోహిత్ మంచి కెప్టెన్ అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ను కెప్టెన్గా చేస్తే టీమిండియాకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నాడు. రోహిత్ నాయకత్వ ప్రతిభకు ఐపిఎల్లో అతని సారధ్యంలో ముంబై సాధించిన ఐపిఎల్ ట్రోఫీలే నిదర్శనమన్నాడు. విరాట్తో పోల్చితే రోహితే ఉత్తమ కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయినా కూడా భారత క్రికెట్ బోర్డు రోహిత్ను చిన్నచూపు చూడడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ మరింత మెరుగైన జట్టుగా ఎదగాలంటే రోహిత్కు సారధ్య బాధ్యతలు అప్పగించడం ఒక్కటే మార్గమని గంభీర్ స్పష్టం చేశాడు.
రోహిత్ను కెప్టెన్గా నియమించాలి: గంభీర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -