- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఇద్దరు ఉగాండా జాతీయుల నుంచి రూ.68 కోట్ల విలువైన హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన బ్యాగుల్ని చెక్ చేయగా, 51 పొట్లాల్లో 9.8 కిలోల హెరాయిన్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఉగాండాలోని ఎంటెబ్బేకు చెందినవారిగా గుర్తించామని తెలిపారు. అనుమానం రాకుండా బ్యాగుల్లో పుస్తకాల మధ్య హెరాయిన్ ప్యాకెట్లు ఉంచారని అధికారులు తెలిపారు.
Heroin worth Rs 68 crore seized in Delhi
- Advertisement -