Monday, April 29, 2024

భార్య గొంతు కోసిన స్టేషన్ మాస్టర్… భవనం పైనుంచి దూకి….

- Advertisement -
- Advertisement -

Six brutally murdered in Visakhapatnam

పాట్నా: దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య గొంతు కోసి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలోని పత్రాకర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అతుల్ లాల్ (50) అనే వ్యక్తి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నారు. తన భార్య తులికా కుమారీతో (45) కలిసి జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో ఊగిపోయిన అతుల్ తన భార్య గొంతు కోశాడు. అనంతరం అదే భవనం పైనుంచి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారి రవీంద్ర  కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News