అబుదాబి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టుకు బెంగళూరు 165 పరుగలు ఓ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. సాధారణ స్కోరు చేసింది. మెరుపు ఆరంభం దక్కినా.. బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో పెవిలియన్ చేరడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(74) అర్ధశతకంతో చెలరేగగా, మరో ఓపెనర్ జోష్ ఫిలిప్(33) కూడా రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), డివిలియర్స్(15), శివమ్ దూబే(2) నిరాశపరచడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో చెలరేగి బెంగళూరును కట్టడిచేశాడు. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, పొలార్డ్ లకు తలో వికెట్ పడగొట్టారు.
IPL 2020: RCB Setup 165 Runs Target against MI