- Advertisement -
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం కొవిడ్-19 వ్యాక్సిన్ను బహిరంగంగా వేయించుకున్నారు. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు ధైర్యంగా దీన్ని వేయించుకోవాలన్న ఉద్దేశంతోనే తాను బహిరంగంగా టీకా వేయించుకున్నానని ఆయన తెలిపారు. క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో బైడెన్ ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. అంతకుముందే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న బైడెన్ సతీమణి డాక్టర్ జిల్ బైడెన్ కూడా ఈ సందర్భంగా భర్త పక్కనే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం అహర్నిశలు శ్రమించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు బైడెన్ ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికన్ పౌరులందరూ దీన్ని భయపడకుండా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
- Advertisement -