వందశాతం సక్సెస్రేట్ ఉన్న దర్శకుడు కొరటాల శివ కొత్త సినిమా చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్పై ఆటోమేటిక్గా భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే చెప్పేదేముంది? అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం కొరటాల శివ, – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ’ఆచార్య’ అందుకే క్రేజీ ప్రాజెక్ట్గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ విరమణ తర్వాత ఎప్పుడు షూటింగ్లకు అనుమతి లభిస్తుందో అప్పుడు వెంటనే ’ఆచార్య’ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఇదిలాఉండగా ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
ఈ సినిమా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తే… ఈ సినిమా తన పంథా అయిన సామాజిక అంశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్, చిరంజీవి మాస్ ఇమేజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ కోసం ఒక పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేశానని.. ఈ పాత్ర ప్రేక్షకులపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ సినిమాలో చిరంజీవి ప్రొఫెసర్గా మారిన నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. చిరంజీవి తనయుడు రామ్చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరు సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.