- Advertisement -
గోమా: కాంగోలో ఇరగొంగొ అగ్ని పర్వతం బద్ధలైంది. అగ్ని పర్వతం నుంచి లావా నిప్పులు కక్కడంతో 11 మంది మృతి చెందారని 170 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని యూనిసెఫ్ తెలిపింది. గోమా నగర శివారులో వందల కొలది ఇండ్లలోకి లావా చేరింది. దీంతో స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. పది వేల మంది స్థానికులు రువాండాకు చేరుకున్నట్టు సమాచారం. గోమా నగరంలో 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రజలను భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్ని పర్వతం నుంచి పలుమార్లు పేలుడు శబ్ధాలు వినిపించాయని స్థానికులు వెల్లడించారు.
- Advertisement -