Sunday, April 28, 2024

విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ‘మహాసముద్రం’…

- Advertisement -
- Advertisement -

Mahasamudram movie Shoot completed

శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ బ్యూటీ అదితిరావు హైదరి, గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్‌లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించిన మేకర్స్.. గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మహాసముద్రం’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో శర్వా,  సిద్దార్థ్ ఇద్దరూ కనిపిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాలను జోడిస్తూ ఈ వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ‘మహాసముద్రం’ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

https://twitter.com/Actor_Siddharth/status/1413371420847984645?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1413371420847984645%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftimesofindia.indiatimes.com%2Fentertainment%2Ftelugu%2Fmovies%2Fnews%2Fshoot-of-sharwanand-siddharth-aditi-rao-hydari-anu-emmanuel-starrer-mahasamudram-wrapped-up%2Farticleshow%2F84266520.cms

Mahasamudram movie Shoot completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News