Sunday, April 28, 2024

పాతబస్తీలో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

పాతబస్తీలో కాల్పుల కలకలం
కేఫ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి
అదులోకి తీసుకున్న పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంపై నెలకొన్న వివాదం కాల్పులకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం…పాతబస్తీకి చెందిన ఆయుబ్‌ఖాన్, జకీర్ కలిసి అలీకేఫ్‌కి వచ్చారు. ఇద్దరు కలిసి కేఫ్‌లో కూర్చుని టి తాగుతూ డబ్బుల విషయం మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న చిన్న విషయాలతో మొదలై భూమి వివాదం వరకు వెళ్లింది. దీంతో సహనం కోల్పోయిన జకీర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో ఆయుబ్ ఖాన్‌ను బెదిరించాడు. అక్కడితో ఆగకుండా గన్ లోడ్ చేసి కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో హోటల్‌లో ఉన్న కస్టమర్లు, యజమాని భయాదోంళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్‌కు చెరుకున్న పోలీసులు దాడి చేసిన జకీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జకీర్ మద్యం మత్తులో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గన్ ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man Arrested after shot at Old City in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News