Monday, April 29, 2024

ఆలస్యంగా వస్తున్నాడని భర్త ముఖంపై వేడి వేడి నూనె పోసి….

- Advertisement -
- Advertisement -

MP woman pours boiling oil on husband

భోపాల్: భర్త ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడనే కోపంతో అతడి ముఖంపై వేడి వేడి నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరవింద్ అహివార్ అనే వ్యక్తి నాలుగేళ్ల కింద శివకుమారి పెళ్లి చేసుకుంది. అరవింద్ రోజూ వారి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో అతడితో భార్య గొడవ పెట్టుకునేది. ఈ పంచాయతీ ఇరు కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది. ఎంత చెప్పి భర్తలో మార్పురాలేదు. దీంతో భర్త నిద్రలో ఉన్నప్పుడు అతడిపై ముఖంపై వేడి వేడి నూనె పోసింది. అతడు అరుపులతో బయటకు పరుగెత్తడంతో స్థానికులు అరవింద్‌ను బుందేల్ ఖండ్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News