Friday, May 17, 2024

శ్రావణి కేసులో కొత్త మలుపు…

- Advertisement -
- Advertisement -

New twist in actress Sravani death case

హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిమిషానికో ట్విస్ట్ బయటకొస్తోంది, శ్రావణి ఎపిసోడ్‌లో రోజుకో విషయం బయటికి వస్తోంది. దేవరాజ్, సాయికృష్ణ ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. దేవరాజ్ రెడ్డిని విచారించిన పోలీసులు సాయికృష్ణ, అశోక్‌రెడ్డిని విచారించి కేసును కొలిక్కి తెచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. దేవరాజ్ రెడ్డి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. టిక్‌టాక్ వీడియోలు, ఫోన్ రికార్డుల ఆడియోలు, వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. దేవారాజ్ రెడ్డి ఇచ్చిన సాక్షాల ఆధారంగా సాయికృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. శ్రావణి జీవితంతో ఆటలాడుకున్న సాయికృష్ణ, దేవరాజ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో ఇద్దరు కొట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. తలలు పగులకొట్టుకునేలా దాడులు చేసుకున్నారు.

శ్రావణి హీరో దేవరాజ్…

తన హీరో దేవరాజ్ అని శ్రావణి తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఎస్‌ఆర్ నగర్‌లో శ్రావణి పెట్టిన కేసులో దేవరాజ్ అరెస్టైన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరు కలిశారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడింది. కుటుంబ సభ్యులకు శ్రావణి, దేవరాజ్‌ను ప్రేమించడం ఇష్టంలేదు. పలుమార్లు దేవరాజ్, శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించాడు. తను చెప్పినట్లు నడుచుకోకుంటే శ్రావణిని రోడ్డుపైకి ఈడుస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న శ్రావణి, దేవరాజ్‌ను నిలదీసింది. ఫొటోలు, వీడియోలపై శ్రావణి, ఆమె సోదరుడు, బావ వచ్చి దేవరాజ్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవ జరగడంతో దేవరాజ్‌పై దాడి చేశారు. దేవరాజ్ రెడ్డి…శ్రావణి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవరాజ్‌రెడ్డిపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దేవరాజ్‌రెడ్డిని అరెస్టు చేశారు.

ఆత్మహత్యకు ముందు ఇద్దరు కలిసి డిన్నర్…

బెయిల్‌పై విడుదలయ్యాక దేవరాజ్ రెడ్డి, శ్రావణి ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు పంజాగుట్ట శ్రీకన్య రెస్టారెంట్‌లో శ్రావణి, దేవరాజ్‌రెడ్డి కలుసుకుని డిన్నర్ చేశారు. ఇద్దరు రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో సాయికృష్ణ అక్కడికొచ్చాడు. ఈ సందర్భంగా దేవరాజ్‌సాయికృష్ణ మధ్య మాటమాట పెరిగి గొడవ పడ్డారు. ఇద్దరు మధ్య గొడవ జరిగిన తర్వాత సాయికృష్ణ, శ్రావణిని కొట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా తనపై దాడి చేశారని శ్రావణి వీడియోలో వాపోయింది. కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News