- Advertisement -
లక్నో: నవజాత శిశువును యమునా నదిలో వదిలిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మధుర ప్రాంతంలో జరిగింది. నవవాన్ బృందావన్లోని చాముండా ఘాట్ వద్ద యమునా నదిలో ఇనుప రేకుపై శిశువు కనిపించడంతో స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లటి వస్త్రంలో చుట్టి నదిలో వదిలారని, నవజాత శిశువు ఏడుస్తుండగా స్థానిక ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ మనోజ్ శర్మ తెలిపాడు. నదిలో వదిలిపెట్టిన వ్యక్తి కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. శిశువును ఎవరు దత్తత తీసుకోకపోవడంతో జిల్లా యంత్రాంగం సహాయంతో శిశువు సంరక్షణ చర్యలు చేపడుతామని హిందూస్థానీ బిరాదరి వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ తెలిపారు.
- Advertisement -