- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది పోలీసులకు సోకగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. దీంతో 50 ఏళ్లు పైబడిన పోలీసులు వీధుల్లోకి రావొద్దని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారు డ్యూటీకి రావొద్దని సూచించింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 8590కి చేరుకోగా 369 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబయిలోనే 5776 మందికి కరోనా వైరస్ సోకింది. భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 29673 మంది చేరుకోగా 940 మంది చనిపోయారు. తెలంగాణలో 1003, ఎపిలో 1259 మందికి కరోనా కేసులున్నాయి. ప్రపంచంలో కరోనా బాధితులు సంఖ్య 30.65 లక్షలకు చేరుకోగా 2.11 లక్షల మంది చనిపోయారు.
రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
|
కరోనా బాధితులు
|
కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|
మహారాష్ట్ర | 8,590 | 1,282 | 369 |
గుజరాత్
|
3,548 | 394 | 162 |
ఢిల్లీ
|
3,108 | 877 | 54 |
రాజస్థాన్
|
2,335 | 744 | 51 |
మధ్య ప్రదేశ్
|
2,165 | 357 | 110 |
ఉత్తర ప్రదేశ్
|
1,986 | 399 | 31 |
తమిళనాడు | 1,937 | 1,101 | 24 |
ఆంధ్రప్రదేశ్ | 1,259 | 258 | 31 |
తెలంగాణ | 1,003 | 332 | 25 |
పశ్చిమ బెంగాల్ | 697 | 109 | 20 |
జమ్ము కశ్మీర్
|
546 | 164 | 7 |
కర్నాటక
|
520 | 198 | 20 |
కేరళ | 482 | 355 | 4 |
బిహార్
|
346 | 57 | 2 |
పంజాబ్
|
330 | 98 | 19 |
హర్యానా
|
304 | 218 | 3 |
ఒడిశా
|
118 | 37 | 1 |
ఝార్ఖండ్ | 103 | 17 | 3 |
ఉత్తరాఖండ్ | 51 | 33 | – |
ఛండీగఢ్
|
45 | 17 | – |
హిమాచల్ ప్రదేశ్ | 40 | 25 | 2 |
అస్సాం | 37 | 27 | 1 |
ఛత్తీస్ గఢ్
|
37 | 34 | – |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 15 | – |
లడఖ్ | 20 | 16 | – |
మేఘాలయ | 12 | – | 1 |
పుదుచ్చేరీ | 8 | 5 | – |
గోవా | 7 | 7 | – |
మణిపూర్ | 2 | 2 | – |
త్రిపుర | 2 | 2 | – |
అరుణాచల్ ప్రదేశ్
|
1 | 1 | – |
మిజోరం | 1 | – | – |
మొత్తం
|
29,673 | 7,181 | 940 |
No duty above 50 Years police in Maharashtra
- Advertisement -