Monday, April 29, 2024

స‌రిహ‌ద్దుల్లో ఉధృిక్తత వాతావ‌ర‌ణం.. ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ అకస్మిక పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకస్మికంగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఉదయం త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్‌తోపాటు ప్రధాని మోడీ లేహ్ చేరుకున్నారు. అక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్వయంగా సైనికులతో మాట్లాడనున్నారు. అనంతరం గాల్వన్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధాని పరామర్శించనున్నారు. కాగా, డ్రాగన్ చైనా ఒకపక్క భారత ఆర్మీ అధికారులతో చర్చలు జరపుతూనే.. మరోపక్క భారీగా తమ బలగాలను మొహరిస్తుండడంతో ప్ర‌స్తుతం ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లో ఉధృిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు వెళ్లడం ప్రధానత సంతరించుకుంది.

 

PM Modi Sudden Visits to Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News