Monday, April 29, 2024

తండ్రి, మనవరాలిని చంపి… మైనర్ పై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Photographer rape attempt

 

రాయ్‌పూర్: తన దగ్గర పని చేసే పశువుల కాపరిని, మనవరాలిని యజమాని చంపి కూతురుపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సంత్రమ్ మంజ్వుర్ (45)అనే వ్యక్తి దగ్గర బాలిక తండ్రి పశువుల కాపారిగా పని చేస్తున్నాడు. జనవరి 29న తన సంత్రమ్ తన బైక్‌పై బాలిక, ఆమె తండ్రి, మనవరాలును వేరే ప్రాంతంలో దింపేందుకు బయలుదేరారు. మార్గ మద్యంలో మద్యం సేవించేందుకు ఆగాడు. సంత్రమ్‌కు మరో ఇద్దరు నిందితులు కలిశారు. బాలికపై ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేస్తుండగా అడ్డొచ్చిన తండ్రి, మనవరాలిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం బాలికపై అఘాయిత్యం చేసి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు సంత్రమ్‌తో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News