టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న సమంత కోలీవుడ్లోనూ స్టార్ డమ్ని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం సామ్ బాలీవుడ్లో అడుగు పెడుతోందా? అంటే అవుననే ఓ సమాచారం లీకైంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ సామ్ని బాలీవుడ్కి పరిచయం చేయాలని చూసినా అప్పట్లో కుదరలేదు. ‘ఏక్ దీవానా థా’ చిత్రంలో సమంత నటిస్తోందని చాలా కాలం క్రితం ప్రచారమైనా అది సాధ్యపడలేదు. ఆ తర్వా త ఈ స్టార్ హీరోయిన్ని బాలీవుడ్కి పరిచయం చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు సాగాయి. కానీ ఏడాదికి సరిపడా సినిమాలతో సౌత్ లోనే నిరంతరం బిజీగా ఉంటున్న సమంత హిందీ పరిశ్రమకు వెళ్లేందుకు ఆసక్తిగా లేనని అప్పట్లో ప్రకటించింది. ఆ క్రమంలోనే తన గురువు, ‘ఏమాయ చేశావే’ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రోద్బలంతో బెట్టు వీడి సామ్ హిందీ పరిశ్రమకు వెళ్లేందుకు అంగీకరించింది. అతను తెరకెక్కిస్తున్న తాజా త్రిభాషా చిత్రంలో ఈ స్టార్ హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీ హిందీ వర్షన్లో యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సరసన సామ్ నటించనుంది. ప్రేమకథల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. మూడు భాషలలో కథానాయికను అనుకున్నప్పుడు హిందీలో కూడా సమంతనే హీరోయిన్గా ఎంపిక చేశారట.
గౌతమ్ మీనన్ చిత్రంతో బాలీవుడ్లోకి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -