Monday, April 29, 2024

శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Seven workers killed after drinking sanitizer in Yavatmal

మహారాష్ట్ర: యావత్మల్ జిల్లాలోని వాని తహసీల్‌లో శుక్రవారం శానిటైజర్ సేవించి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ -19 పరిమితుల కారణంగా జిల్లాలో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. మద్యం దొరక్క కూలీలు శానిటైజర్ తాగినట్టు సమాచారం. ముగ్గురు మరణించిన వారికి పోస్టుమార్టం నిర్వహించినట్లు వాని పోలీస్ స్టేషన్ అధికారి వైభవ్ జాదవ్ చెప్పారు. మిగిలిన నలుగురి బంధువులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. మేము ఇప్పటివరకు ముగ్గురి మరణాలను నమోదు చేసాము. మిగిలిన వివరాలను సేకరిస్తున్నామని పిఐ జాదవ్ వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు.. యువకులు 5 లీటర్ల శానిటైజర్ కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. తరువాత, వారు వాంతులు చేసుకున్నారు. గమనించిన కుటుంబీకులు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారు ఒకరి తరువాత ఒకరు మరణించారు.

Seven workers killed after drinking sanitizer in Yavatmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News