లక్నో: ఓ మహిళపై ఐదుగురు అత్యాచారం చేయడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు ఆమెపై ఎస్ఐ మళ్లీ అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 30న ఒక మహిళను కారులో నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. జలాలాబాద్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు ఆమెపై ఎస్ఐ అత్యాచారం చేశాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అడిషన్ల్ డిజిపి అవినాశ్ రెండు ఘటనలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. విచారణ జరిపినప్పుడు గతంలో ఆమెపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్టు సమాచారం. సదరు ఎస్ఐ తనపై అత్యాచారం చేశాడని సదరు మహిళ తన వద్దకు రాలేదని షాహజాన్పూర్ ఎస్పి ఆనంద్ మీడియాకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేప్ బాధితురాలిపై ఎస్ఐ అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -
- Advertisement -