Monday, April 29, 2024

దళితులను ఆదుకున్నది జగనే: వనిత

- Advertisement -
- Advertisement -

అమరావతి: దళితులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది వైసిపి ప్రభుత్వమేనని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. మంగళవారం వనిత మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడులంటూ ఈనాడులో వార్తలు అవాస్తవమన్నారు. దళితులపై చంద్రబాబు పాలనలో జరిగిన దాడులపై పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. దళితులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ, సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారని, దళితులను అన్ని విధాలా ఆదుకున్నది సిఎం జగన్ మాత్రమేనన్నారు. దళితులంతా సిఎం జగన్ వెంటే ఉన్నారని వనిత పేర్కొన్నారు.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరిడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News