- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 997 కేసులు నమోదుకాగా నలుగురు చనిపోయారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా 2.55 లక్షలకు చేరుకోగా 1397 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.37 లక్షలు ఉండగా 17 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 48.12 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -