Monday, April 29, 2024

ఇఎస్‌ఐ అక్రమాలలో రూ. 2.29 కోట్ల సీజ్

- Advertisement -
- Advertisement -

Telangana ESI medicines scam

హైదరాబాద్: ఇఎస్‌ఐ స్కామ్‌లో శుక్రవారం నాడు ఎసిబి అధికారులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మిలకు చెందిన రూ. 2.29 కోట్ల నగదును సీజ్ చేశారు. నగరంలోని కూకట్‌పల్లిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి రూ. 1,29,30,000, ఆమె కుటుంబ సభ్యులు, బినామీల పేరిట రూ. 65,00,000 రియల్ ఎస్టేట్ కంపెనీకి చెల్లించినట్లు ఎసిబి విచారణలో తేలింది. అదేవిధంగా ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి రూ.35,00,000 మొత్తాలను చెక్కులు, ఆన్‌లైన్ ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీకి చెల్లించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈక్రమంలో సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో 1500 ఎస్‌ఎఫ్‌టి స్థలంలో 6 ఫ్లాట్స్ కొనుగోలుకు ఓ బిల్డర్‌కు చెల్లించారని ఎసిబి అధికారులు తెలిపారు. ఈక్రమంలో పక్కా సమాచారంతో బిల్డర్ దగ్గర రూ. 2.29 కోట్ల రూపాయలను ఎసిబి అధికారులు సీజ్ చేశారు. బిల్డర్ వద్ద దేవికా రాణి, నాగలక్ష్మిలు బినామీ పేర్ల మీద నగదు దాచినట్లుగా ఎసిబి అధికారులు ముందే గుర్తించారు.

గతంలో ఇఎస్‌ఐ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలో రెసిడెన్షియల్ స్థలం కోసం బిల్డర్ దగ్గర దేవికారాణి డబ్బులు ఆన్‌లైన్‌తో పాటు వివిధ రకాలుగా డిపాజిట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. దేవికారాణి అవినీతి డబ్బుతో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు స్కెచ్ వేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు డెవలపర్‌కు బారీ మొత్తాలు ఇచ్చినట్లు గుర్తించినట్లుగా ఎసిబి అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు రియల్టర్‌కు ఎసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా రియాల్టర్ ఆస్తులను అటాచ్ చేస్తామనే ఎసిబి అధికారులు హెచ్చరించడంతో సదరు రియాల్టర్లు నగదును ఎసిబి అధికారులకు తిరిగి ఇవ్వడంతో వాటిని సీజ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News