Monday, April 29, 2024

ఎపి సిఎంను కలిసిన నటుడు నాగార్జున

- Advertisement -
- Advertisement -

Tollywood actor Nagarjuna meets YS Jagan

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు నాగార్జున గురువారం నాడు సమావేశమయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి విజయవాడకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌తో సినీ హీరో అక్కినేని నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు రెండు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈక్రమంలో సమావేశం ముగిసిన అనంతరం ఎపి సిఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. సిఎం జగన్‌ను కలిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉందని, జగన్ నా శ్రేయోభిలాషి అని అతన్ని చూసి చాలా రోజులవుతోందని, అందుకే విజయవాడకు వచ్చానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News