Monday, April 29, 2024

ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సమ్మె కాలం వేతనాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసి ఉద్యోగులు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తమ డిమాండ్లను నెరవేర్చాలని గత యేడాది అక్టోబర్ 5 నుంచి 47 రోజులపాటు ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్మె కాలంలో దాదాపు 35 మంది ఆర్టీసి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. సమ్మె ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ ఆదేశాలతో చనిపోయిన ఆర్టీసి ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించారు.

TS Govt Released TSRTC Employees Strike period Salaries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News