- Advertisement -
హైదరాబాద్: యుకె నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారి శాంపిల్స్ని సిసిఎంబికి పంపించామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. యుకె నుంచి వచ్చిన వారిని 60 శాతానికి పైగా గుర్తించామని, వారి శాంపిల్స్ని ల్యాబ్కు పంపామన్నారు. నెగెటివ్ వచ్చినా వారంపాటు తప్పకుండా క్వారంటైన్లో ఉండాలన్నారు. రెండు వారాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామన్నారు. కచ్చితంగా అందరూ మాస్కు పెట్టుకోవాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
- Advertisement -