- Advertisement -
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై 18న ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కమలారాణి మృతిపట్ల సిఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఆమె మరణంతో ఇవాళ అయోధ్య పర్యటనను సిఎం యోగి రద్దు చేసుకున్నారు. కమలారాణి కాన్పూర్లోని ఘటంపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 11, 12వ లోక్సభల్లో ఆమె సభ్యురాలిగా పనిచేశారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు, నేతలు సంతాపం తెలిపారు.
- Advertisement -