Monday, April 29, 2024

నాల్గో పెళ్లి కోసం… అంధుడైన కుమారుడిని చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

Widow drowns partially blind son for marriage

 

పాట్నా: నాలుగో పెళ్లి కోసం అంధుడైన కుమారుడిని తల్లి నీళ్లలో ముంచి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలోని హసన్ పూర్ ఖండేహ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాహాజాన్ పూర్ ప్రాంతంలోని  ధర్మశీలి దేవికి నాలుగేళ్ల కుమారుడు సజన్ కుమార్  ఉన్నాడు. దేవి మొదటి భర్త అరుణ్ చౌదరికి సజన్ కుమార్ జన్మించాడు. అరుణ్ తో విడాకులు తీసుకున్న అనంతరం దేవి రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతడు కూడా చనిపోవడంతో మూడో వ్యక్తి మహేష్ చౌదరీ వివాహం చేసుకుంది. మహేష్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో నాలుగో పెళ్లి చేసుకోవాలని దేవి నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోవడానికి కుమారుడు అడ్డంకిగా ఉండడంతో తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. బహుదూర్ చౌక్ ప్రాంతంలో నివసిస్తున్న దేవి… నాలుగేళ్ల బాలుడిని నీళ్లలో ముంచి చంపేసి తిరిగి ఇంటికి వచ్చింది. నీళ్లలో బాలుడి మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారం మేరకు బాలుడి తల్లి దేవిగా పోలీసులు గుర్తించారు. దేవిని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దేవిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News