Monday, April 29, 2024

అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన భర్త..

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్(74) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన ఆస్థిని ఇద్దరు కుమార్తెలకు సమానంగా పంచి ఇచ్చాడు. చిన్న కుమార్తె అస్మాను సల్మాన్‌కు ఇచ్చి వివాహం చేశాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. గత కొంత కాలం నుంచి అదనపు కట్నం తేలవాలని భర్త వేదించడంతో తండ్రి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి షరీఫ్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్మా ఆస్పత్రికి వెళ్లేందుకు బయటికి వచ్చారు. ఇదే సమయంలో బయట ఉన్న సల్మాన్ అతడి స్నేహితులు అస్మాను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తండ్రి అడ్డుకునేందుకు యత్నించగా దాడి చేయడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తన కూతురిని ఎక్కడికి తీసుకుపోయారు తెలియడంలేదని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Wife kidnaped by Husband for Extra dowry in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News