Monday, April 29, 2024

భర్త బిర్యానీ తేలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని…

- Advertisement -
- Advertisement -

Rape

 

హైదరాబాద్: భర్త బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి… కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  వెంకటయ్య, పద్మ(28) అనే దంపతులు రహ్మత్ నగర్ లోని ప్రేమ్ నగర్ బస్తీలో నివాసముంటున్నారు. వెంకటయ్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బిర్యానీ కావాలని గత మూడు రోజుల నుంచి భార్య భర్తను బతిమిలాడుతోంది. బిర్యాన్ని తీసుకరాకపోవడంతో మనస్థాపానికి గురైన భార్య ఒంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేసి 108, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుత్తం ఆమె ఉస్మానియా ఆస్పత్రిలో 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Wife Suicide attempt without Biryani in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News