లక్నో: రెండో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు మొదటి ప్రియుడిని అతడితో కలిసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో రెండో ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యోగేష్ సక్సేనా అనే వ్యక్తికి ఉమ అనే గర్ల ఫ్రెండ్ ఉంది. ఉమ తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడమేకాకుండా యోగేష్తో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ మధ్యలో సునీల్ శర్మ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితో ఉమ చనువుగా ఉంటుంది. సునీల్ను ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది, కానీ అప్పటికే యోగేష్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో యోగేష్ ను తప్పించాలని సునీల్తో కలిసి ప్లాన్ వేసింది. మొదటి ప్రియుడిని ఓ నిర్మానుష ప్రదేశానికి రమ్మని ఉమ కబురు పంపింది. యోగేష్ అక్కడికి వెళ్లగానే అతడి కళ్లలో సునీల్ కారం పొడి చల్లాడు. అనంతరం యోగేష్ గొంతును సునీల్ కోశాడు. తన ప్రియురాలిని సునీల్ కలిశాడు. మళ్లీ ఇద్దరు కలిసి యోగేష్పై దాడి చేసిన స్థలానికి వచ్చారు. యోగేష్ చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత మృతదేహంపై సునీల్ పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. మర్డర్ గురించి చెప్పిన వారికి రూ. 15000 రివార్డు ఇస్తామని ఎస్పి ఆర్కె బాటియా ప్రకటించాడు. రివార్డు ప్రకటించిన 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఉమ, సునీల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.