షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్ 2020 టోర్నీలో భాగంగా ట్రయల్ బ్లేజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సూపర్ నోవాస్ విజయం సాధించింది. నోవాస్ జట్టు నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు పోరాడి ఓడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ట్రయల్ బ్లేజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు స్మృతి మంధానా(33), డీంద్రా దొత్తిన్(27), దీప్తి శర్మ(43 నాటౌట్) రాణించిన ఫలితం దక్కలేదు. దీంతో ట్రయల్ బ్లేజర్స్ జట్టుపై 2 పరుగుల తేడాతో నోవాస్ గెలుపొందింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. చమరి ఆటపట్టు(67) అర్ధసెంచరీతో మెరవగా.. ప్రియా పూనియా(30), హర్మన్ప్రీత్ కౌర్(31) రాణించారు. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో గోస్వామీ, సాల్మా, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.
Women’s T20 Challenge: SUP win by 2 Runs against TRA