- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్, ఒక మరణం నమోదయినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని చిత్తూరు-8, గుంటూరు-9, కడప-1, కృష్ణా -7, కర్నూలు-9, నెల్లూరు -9, విశాఖపట్నం- 4, పశ్చిమ గోదావరి-1 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ బులెటిన్లో ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,205కు చేరింది. ప్రస్తుతం 803 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,353 ఈ కరోనా మహమ్మారితో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో కరోనా మృతుల సంఖ్య 49కి చేరింది.
- Advertisement -