- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచే బాధ్యతను కూడా తీసుకున్నట్లు యాంకర్ శివజ్యాతి చెప్పారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ దశలో బిత్తిరి సత్తి విసిరిన సవాల్ను స్వీకరించి మంగళవారం యాంకర్ శివజ్యోతి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని శివజ్యోతి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. వీరిలో బిగ్బాస్ ఫేమ్ హిమజ, అశురెడ్డి, రోహిణి ఉన్నారు. ఈ సందర్భంగా శివజ్యోతి మాట్లాడుతూ ఈ ముగ్గురు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగకరంగా ఉందన్నారు.
- Advertisement -