Monday, April 29, 2024

గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ”ఏప్రిల్ 27నా కరోనా వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జర్పుకొలేక పోయాం. రేపటి నుండి గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. టిఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సాగునీరు, త్రాగునీరు, కరెంట్, రైతుబందూ, రైతు భీమా అనేక రంగాలలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టిఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తుంది. రేవంత్ పిసిసి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కెసిఆర్ మాత్రమే. మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు.. పెంచిన గ్యాస్, డీజిల్ ధరలపై ఢిల్లీ యాత్రలు చేయాలి. మేము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెస్తుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. పెరగాల్సిన జిడిపి తగ్గుతుంటే ప్రజల నడ్డి విరిచే పెట్రో ధరలు పెరుగుతున్నాయి. బిసి మంత్రిత్వ శాఖ పెట్టలేదు కానీ, ఉద్యోగాలు ఉడగోట్టే శాఖ పెట్టింది. కొన్ని పార్టీలు ఆంధ్ర నాయకుల చేతిలో, ఢిల్లీ నాయకుల చేతిలో పని చేస్తాయి. టిఆర్ఎస్ కు ప్రజెలే హై కమాండ్.. తెలంగాణ ఇంటి పార్టీ, లోకల్ పార్టీ టిఆర్ఎస్” అని పేర్కొన్నారు.

Harish Rao speech at TRS Party office in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News