Monday, April 29, 2024

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న మహేష్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే హారికా అండ్ హాసినీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో మహేష్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వచ్చే యేడాది సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇప్పడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.

Mahesh and Trivikram joins hands for #SSMB28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News