Monday, April 29, 2024

రిమోట్ అడిగిన బాలిక హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally kills 7 year old girl at Tamil Nadu

చెన్నై : టివి ఛానల్ మార్చడానికి రిమోట్ అడిగినందుకు ఫలితం ప్రాణాలనే కోల్పోయిన ఏడేళ్ల బాలిక విషాదాంతం బయటపడింది. నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు తూతుకూడి జిల్లా సదంకుళం పట్టణంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మృతురాలు ఉంటున్న చోట విద్యుత్ లేనందున ఆమె టివి చూడడానికి పొరుగింటికి వెళ్లడం అలవాటు.

ఆమె పొరుగింటికి వెళ్లి టివి చూస్తూ ఛానెల్ మార్చడానికి ఆ ఇంటి వారిని రిమోట్ అడిగింది. ఆ ఇంటిలోని తండ్రీ కొడుకులు ఘర్షణ పడుతున్నారు. రిమోట్ అడిగినందుకు కోపగించుకుని నిందితుడు ఏడేళ్ల బాలిక గొంతునులిమి ఊపిరాడకుండా చేశాడు. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో శవాన్ని కుక్కాడు. తన స్నేహితుని సహాయం తో ఆ శవాన్ని సమీపాన కాలువలో పారేశాడు. బాలిక తల్లి దినసరి కార్మికురాలు. పోలీసులకు సమాచారం అందగానే పోలీసులు శవాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి పంపారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News