- Advertisement -
అమరావతి: అనంతపురం జిల్లా ఈస్ట్ నరసాపురంలో పింఛను తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలు నడిరోడ్డుపై మృతి చెందింది. కర్నూలు నుంచి శింగనమల మండలం ఈస్ట్ నరసాపురానికి వృద్ధురాలు వచ్చింది. ఈస్ట్ నరసాపూరంలో రహదారిపైనే వృద్ధురాలు దుర్గమ్మ మృతి చెందింది. కర్నూలు నుంచి రావడంతో ఆమెకు కరోనా ఉందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం వద్దకు వెళ్లేందుకు గ్రామస్థులు, అధికారులు ముందుకు రాలేదు. కర్నూలు జిల్లాలో తన కుమార్తె దగ్గర నుంచి దుర్గమ్మ ఇవాళ నరసాపురం వచ్చినట్టు సమాచారం.
Old women dead in Ananthapuram district in Andhra
- Advertisement -