కేరళ: పాలక్కాడ్ జిల్లా ములప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి కె.రాజు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామని కేరళ మంత్రి తెలిపారు. ఫైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న పదిహేను ఏళ్ల ఏనుగును చంపిన సంఘటనపై కేరళ సర్కార్ సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు, అటవీశాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఏనుగు మృతి ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఎంపి మేనకా గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతోపాటు పలువులు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పింది.
One arrested for pregnant elephant death in Kerala