- Advertisement -
‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే సరికొత్త వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ‘ఆహా’ ఓటీటీ. రెజీనా, నివేదా సతీష్, అగస్త కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్తో పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.‘బాహుబలి’ని నిర్మించిన ఆర్కా మీడియా బ్యానర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దీనిని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘ఆహా’ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ వెబ్ సిరీస్తో దర్శకురాలిగా పరిచయమవుతున్న పల్లవి గంగిరెడ్డి ఆహా క్రియేటివ్ టీమ్లో సభ్యురాలు. ఇంతకు ముందెన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్ను ‘అన్యాస్ ట్యూటోరియల్’లో చూడవచ్చు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెజీనా, పల్లవి గంగిరెడ్డి, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -