Monday, April 29, 2024

ఫిబ్రవరి 10లోగా ఆర్‌టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

RTC Cargo services

 

సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..!
ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం
రవాణా శాఖా మంత్రి పువ్వాడ
కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌భవన్‌లో తన కార్యాలయాన్ని మంత్రి అంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అందరికీ ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేశామని స్పష్టం చేశారు. అక్కడ కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగులు నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు.

వాటిని 24 గంటల్లోగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. తన మొబైల్ నెంబర్ 98495 55778కు ఫోన్ చేసి నేరుగా సమస్య చెప్పవచ్చని తెలిపారు. సమ్మె కాలానికి సంబంధించి ఉద్యోగుల వేతనాలు మార్చి 31 లోపు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేడారం జాతరకు వెళ్లే ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా 4వేల బస్సుల్ని అందుబాటులో ఉంచామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించనున్నారని మంత్రి చెప్పారు.

ఫ్యాన్సీ నెంబర్లకు ఈ బిడ్డింగ్ విధానం…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన కాళ్లపై తాను నిలబడే స్థాయికి ఆదాయాన్ని పెంచుకునే దిశలో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇస్తున్నాయని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత మెరుగైన సేవలతో కొత్త ఒరవడితో సంస్కరణలు అమలుల్లోకి రానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రవాణా శాఖలో ఈ బిడ్డింగ్ విధానంతో పారదర్శక సేవలు -అందించనున్నానమి, ఈ క్రమంలోనే ఈ బిడ్డింగ్ విధానాన్ని అమలకు నూతన కార్యాలయంలో తొలి సంతకం చేసినట్లు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచడానికి ఈ బిడ్డింగ్ విధానం అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు.

దరఖాస్తుదారులు కార్యాలయానికి రాకుండానే ఫాన్సీ నెంబర్ల రిజర్వేషన్ కోసం ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఫాన్సీ నెంబర్ల పోటీని దృష్టిని పెట్టుకుని రూపొందించిన ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందని అన్నారు. రవాణా శాఖలో ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను కూడా సరళతరం చేయనున్నట్లు వెల్లడించారు. వాహనాల కొనుగోలు తగ్గడంతో రవాణా శాఖ గ్రోత్ రేటు తగ్గిపోయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం 3.02 శాతం మెరుగుదల ఉందని అజయ్‌కుమార్ తెలిపారు.

రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం..
రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి అజయ్ కుమార్ చెప్పారు. స్వీయ అవగాహనతో నిబంధనల్ని పాటిస్తే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయని, అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మద్యంతాగి వాహనం నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం వంటి కారణాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆర్‌టిసికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశించిన స్థాయిలో సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయడంతోనే ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు.

గత మాసంలో ప్రభుత్వం నుంచి నిధులు కోరకుండానే సంస్థకు వచ్చిన ఆదాయంతోనే ఉద్యోగుల వేతనాలను చెల్లించడం మంచి పరిణామమన్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్‌టిసికి రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు సంస్థకు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఉద్యోగులు బోనస్ తీసుకునే స్థాయికి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు. టిక్కెటేతర ఆదాయం కోసం కార్గో పార్సిల్ సర్వీసు సేవల్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, 50 కార్గో బస్సులు తయ్యారయ్యాయని, వీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంక్రాంతి సీజన్‌లో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.16.85 కోట్లు ఆదాయం వచ్చిందని, ఇది రోజు వారీ ఆదాయంతో పోలిస్తే రూ.6 కోట్ల ఆదాయం అదనంగా రావడం సంతోషదాయకమని, ఇది అందరి కృషి ఫలితమేనని అభినందించారు. ఉద్యోగులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వెల్‌ఫేర్ బోర్డు కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎండి సునీల్ శర్మ, ఆర్‌టిఎ కమిషనర్ సందీప్ సుల్తానియా, రవాణా శాఖ జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, రమేశ్, శ్రీమతి మమతా ప్రసాద్, తదితర ఆర్‌టిఎ అధికారులు పాల్గొన్నారు.

RTC Cargo services to begin on February 10
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News