Monday, April 29, 2024

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత తొలగించేందుకు సహకరిస్తాం : ట్రంప్

- Advertisement -
- Advertisement -

Trump says US trying to help India and China

 

వాషింగ్టన్‌ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్కడ కఠిన పరిస్థితి నెలకొన్నది. మేం భారత్‌తోనూ, చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య పెద్ద సమస్య ఉన్నదని ట్రంప్ అన్నారు. శనివారం ఓక్లహామలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి ముందు వైట్‌హౌస్‌లో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ట్రంప్ ఇప్పటికే ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. గాల్వన్ లోయలో చైనా దాడిలో మృతి చెందిన భారత సైనికుల కుటుంబాలకు అమెరికా రాయబారి సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News