- Advertisement -
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ ఎన్ కౌంటర్ శ్రీనగర్ శివార్లలోని రణ్బీర్గఢ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతాదళాలు, సీఆర్పీఎఫ్ బలగాలు, జమ్ముకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసుల సంయుక్తంగా గాలింపు చర్యులు చేపట్టాయి. గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హత్యమయ్యారు. ఘటనాస్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నాయి.
Two Terrorists killed in Encounter at Ranbirgarh
- Advertisement -