పకుర్(జార్ఖండ్): పకుర్ జిల్లా సదర్ బ్లాక్ పరిధిలోని మనికరపడ పంచాయత్ ముఖియ(గ్రామ పెద్ద) ప్రయాణికస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేయడంతో ఆయనతోపాటు ఆయన మైనర్ కుమార్తె మరణించగా ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా మో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రి కారులో ఇంటికి తిరిగివస్తున్న గ్రామ పెద్ద కౌషర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులపై హతియా మోడ్ వద్ద దుండగులు బాంబులు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. బాంబులు విసిరిన తర్వాత గాయపడిన కౌషర్ అలీని కారులోనుంచి బయటకు ఈడ్చిన దుండగులు ఆయనతో కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. కౌషర్ అలీ, ఆయన మైనర్ కుమార్తె అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన ఆయన భార్య, కుమారుడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. ఈ దాడికి వ్యక్తిగత కక్షలే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
జార్ఖండ్ బాంబు దాడిలో గ్రామ పెద్ద, కుమార్తె మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -